తాండవపల్లి జనసైనికునికి 25000/- ఆర్ధికసాయం

  • తాండవపల్లి గ్రామ కమిటీ నియామకం

అమలాపురం, తాండవపల్లి గ్రామంలో రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ నియామకం జరిగింది. గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గా కైరం ఆదిబాబు నియమించగా వైస్ ప్రెసిడెంట్ గా గుత్తాల నాగరాజుని నియమించారు. కొత్తగా ఏర్పడిన గ్రామ కమిటీకి గ్రామ పెద్దలు జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం తాండవపల్లి గ్రామ జనసైనికుడు పండు ఆనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో తాండవపల్లి, శెట్టిపల్లి గ్రామ జనసైనికులు మరియు పండు సమకూర్చిన 25,000 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, వాకపల్లి వెంకటేశ్వరావు, చిందాడ గరువు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా రవి తాండవపల్లి, శెట్టిపల్లి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.