కిషోర్ కూతురు జన్మదిన సందర్భంగా “నా సేన కోసం నా వంతు” 3001/- విరాళం

పార్వతీపురం, “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా, పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం, కాశీపేట జనసేన నాయకులు, కిషోర్ తన ముద్దుల కూతురు జన్మదిన సందర్భంగా, పార్టీ బాగుంటే నా కూతురు లాంటి ఎంతోమంది ఆడ పిల్లలకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో పార్టీకి 3001 రూపాయలు పంపించడం జరిగింది. కిషోర్ మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీ పాపకు మన జనసేన పార్టీ తరుపున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని పార్వతీపురం జనసేన నాయకులు తెలిపారు.