జనం కోసం జనసేన 408వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: కిర్లంపూడి మండలం, కిర్లంపూడి గ్రామంలో జనం కోసం జనసేన 408వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 48300 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 409వ రోజు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి దంపతులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు కాకిలేటి బాబ్జి, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, కిర్లంపూడి గ్రామం నుండి నాగబోయిన శివ, దడాల శ్రీను, ముప్పిడి నంద, బలసా శ్రీనివాస్, పొలమరసెట్టి వినోద్, ఎశ్. తిమ్మాపురం గ్రామం నుండి ఎద్దు అర్జున్, సింహాద్రిపురం గ్రామం నుండి మెనెడ్డి ఈశ్వరుడు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుసెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కె. గోపాలపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కర్రి కృష్ణ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.