పవనన్న ప్రజా బాట కార్యక్రమం 58వ రోజు

రాజంపేట: రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని రాజంపేట జనసేన కార్యకర్త మల్లెం నరసింహులు పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టివెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా 58వ రోజు శుక్రవారం రాజంపేట మండల పరిధి కారం పల్లె పంచాయతీలోని గుండాల పల్లె, పెద్ద కారంపల్లి, చిన్న కారంపల్లి, లింగరాజు పల్లె, మిట్టమీద పల్లె దొమ్మరోపల్లె గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్త మల్లెం నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే బడుగు బలహీన వర్గాల సమస్యలు తీరాలంటే జనసేన పార్టీ తోనే మార్పు సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ అని అన్నారు. ప్రజలందరూ, జనసేన పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య, జనసేన వీర మహిళ జెడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు.