ఆళ్ళగడ్డ జనసేన కార్యాలయం నందు ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

భవ్య భారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని ఆళ్ళగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మైలేరి మల్లయ్య పిలుపునిచ్చారు. ఆళ్ళగడ్డ జనసేన పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు జెండా వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మైలేరి మల్లయ్య మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల ప్రాణత్యాగలు, పోరాటల ఫలితమే నేటి ఈ స్వాతంత్ర్య భారతమని అన్నారు. యోధులు కళలుగన్న భవ్య భారతదేశ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి బంగారు బాటలు వేసి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, పసుల నరేంద్ర యాదవ్, దేవ ఆంజనేయులు, మద్దిలేటి యాదవ్, భావికాడి గుర్రప్ప, రామిశెట్టి బ్రమేంద్ర కుమార్, కేశవ, చైతన్య, పగడాల నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *