పవనన్న ప్రజాబాట కార్యక్రమం 97 వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, చిల్లపేటరాజాం పంచాయతీ బోడ్డపాడు గ్రామంలో, జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 97వ రోజు బోడ్డపాడు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను అలాగే మేనిఫెస్టో వివరించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రంలో జాబులు కల్పించలేకపోవడం వల్ల రోజురోజుకీ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు యువత అందరకి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు.లక్ష్మునాయుడు పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు జనసేన కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నాము.