జనసేన పోరాటంతో కదిలిన యంత్రాంగం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశంతో.. అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ సూచనలతో.. గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణంలో #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా జనసేన జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికెరి జీవన్ కుమార్, మరియు పామిడి మండలాధ్యక్షుడు యం.ధనుంజయ్ ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి సమస్యలపై చేపట్టిన నిరసనలకు స్పందించి నెహ్రూ నగర్ లో అధ్వానంగా మారిన రోడ్డు, డ్రైనేజీ మరమ్మతులను చేపట్టడం మొదలుపెట్టారు.. అందుకు ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూన్నం. ప్రజలకు కనీస అవసరాలు అయినటువంటి రోడ్లు, డ్రైనేజీలకు తాత్కాలిక పరిష్కారం కాదు శాశ్వత పరిష్కారం చేయాలని. అలాగే జనసేన పార్టీ లేవనెత్తిన మిగతా సమస్యలపై కూడా సత్వరం స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.