ఆపదలో ఉన్న జన సైనికుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన గాదె

పొన్నూరు నియోజకవర్గం: చేబ్రోలు మండలంలోని సేకూరు గ్రామానికి చెందిన జన సైనికుడు వడ్లమూడి శ్రీను కుమారుడు ఇటీవల ఆటో ప్రమాదానికి గురి కావటం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉండాలలనే ఉద్దేశంతో 10000/- రూపాయల మొత్తాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ముందుగా రోడ్డు ప్రమాదానికి గురైన జన సైనికుని కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూవారికి ఆర్థికంగా ఎంతో కొంత పార్టీ తరపున కానీ మా నాయకుల సహాయంతో మా వంతుగా వారికి తోడు నిలబడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీలో ప్రతి ఒక్క జన సైనికునికి మేము, మా నాయకులు ఎప్పుడూ అండగానే ఉంటామని.. మా కార్యకర్తలకి ఎటువంటి ఆపదలు వచ్చినా తక్షణమే సహాయం చేయడంలో మేము వెనకాడమని, ఎలాంటి పరిస్థితులైన మా కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అడపా.మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారుదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, చేబ్రోలు మండల అధ్యక్షుడు చందు, శ్రీరాములు, నెల్లూరు రాజేష్, తుమ్మల నరసింహారావు, మట్టుపల్లి శివరామకృష్ణ, కట్ట గోపి, నారిశెట్టి కృష్ణయ్య, చుక్క సూరి, సూరిబాబు, ఎం వంశీకృష్ణ, శివ మరియు గోపి తదితరులు పాల్గొన్నారు.