ప్రకాశం జిల్లా నుంచి జనసేనలోకి చేరికలు

ప్రకాశం జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కౌలు రైతు భరోసా యాత్రకు ముందు జిల్లాకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. కొండెపి నియోజకవర్గం నుంచి అధికార వైసీపీకి చెందిన సుమారు 40 మంది పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. వీరంతా కొండెపి మండలం కట్టవారిపాలెం, టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలకు చెందిన వారు. పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరందరికీ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జిల్లా కార్యదర్శి మేడా రమేష్ ల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, వీర మహిళా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి శ్రీదేవి, కొండెపి మండలాధ్యక్షులు యనమర్ధిని విశ్వ, టంగుటూరు మండలాధ్యక్షులు కందుకూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
•జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రపై దిశానిర్దేశం
అంతకు ముందు ప్రకాశం జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కౌలు రైతు భరోసా యాత్ర నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. అధ్యక్షుల వారి పర్యటనకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. సభా ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై చర్చించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా కలసికట్టుగా సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని సూచించారు.
•ప్రకాశం జిల్లా కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ విడుదల
అనంతరం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కౌలు రైతు భరోసా యాత్ర గోడ పత్రికలను నాదెండ్ల మనోహర్ గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు పాల్గొన్నారు.

Avatar