చిట్వేలి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

చిట్వేలు జనసేన పార్టీ నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో నిరంతరంగా నిలిచిపోయే మహానుభావుడు భారతరత్న డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన ఆ జ్ఞాన సంపన్నుడి 131వ జయంతి సందర్భంగా నా పక్షాన జనసేన పార్టీ పక్షాన ఆయనకు ప్రణామాలు అర్పిస్తున్నాను అన్నారు. అలాగే పురం సురేష్ మాట్లాడుతూ.. శ్రీ అంబేద్కర్ అందరివాడు. నిత్య ఆరాధనీయుడు. నేడు మన దేశం ఆర్థికంగా సామాజికంగా వర్ధిల్లుతూ ఉందంటే అందుకు కారణం శ్రీ అంబేద్కర్ గారు అని అన్నారు. కంచర్ల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగమే ప్రపంచ గొప్ప మేధావుల్లో ఒకరిగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీ అంబేద్కర్ భారతీయుడిగా జన్మించడం భారతీయులందరూ చేసుకున్న అదృష్టం అన్నారు. పగడాల శివ మాట్లాడుతూ.. అనుభూతి మాటల్లో సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలని శ్రీ అంబేద్కర్ ప్రస్తావించిన ఆదేశిక సూత్రాలు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అన్నారు. షేక్ రియాజ్ మాట్లాడుతూ.. ఆయన చూపిన మార్గాన్ని సదా అనుసరిస్తూ నాదైనా సేవలు ఈ దేశ ప్రజలకు అందిస్తానని.. ఈ పుణ్య దినం సందర్భంగా ఆయనకు జేజేలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిట్వేలి జనసేన పార్టీ నాయకులు మా దాసు శివ కొనిశెట్టి ప్రసాద్, పసల సుబ్బు,నానబల సుభాష్,హేమంత్ రెడ్డి, కడుమురి నాగరాజు, కొనిశెట్టి చక్రి, పసల శివ ఆనందల తేజ, నాగిశెట సురేష్, సువ్వారపు భాను, సువారపు హరి పవన్ రాజు,షేక్ సోను, పగడాల శివరాం, పగడాల భరత్ సునీల్, శంకర, మాది నేని హరి కళ్యాణం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.