ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 13వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, మల్లూరు హరిజనవాడలో శుక్రవారం ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 13వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనుబోలు గణపతి గ్రామస్థులతో మాట్లాడుతూ ఏ పదవీ లేకపోయినా, పార్టీ అధికారంలోకి రాకపోయినా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 3000 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు 30 కోట్ల రూపాయిలతో చనిపోయిన ఆ 3000 మంది కుటుంబాలకు ఇంటికి లక్ష రూపాయలు చొప్పున విడతల వారిగా ఆర్థిక సహాయం అందించాడు. ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి, నేనున్నాను అధైర్యపడవద్దు చదుకునే పిల్లల ఖర్చును కూడా భరిస్తానని భరోసా కల్పించినాడు. అలాంటి మంచి మనసున్న నాయకుడిని మనం గెలిపించుకుని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలూరు పెంచల నరసింహా, తాండ్ర శ్రీను, తదితరులు పాల్గొన్నారు.