రాజమండ్రి ఎంపి భరత్ పై ధ్వజమెత్తిన అనుశ్రీ సత్యనారాయణ

  • 2024లో రాజమండ్రిలో జనసేన జెండా ఎగరేస్తాం

రాజమండ్రి, రాజమండ్రి ఎంపి భరత్ పై జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ఎంపీ భరత్ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని ఈ మూడు సంవత్సరాలలో వైసిపి గవర్నమెంట్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని గత గవర్నమెంట్ హయాంలో ఈ రాజమండ్రి నగరంలో చరిత్రాత్మకమైన మోరంపూడి ఫ్లై ఓవర్ ను శాంక్షన్ చేయడం జరిగింది, అయినప్పటికీ భరత్ రామ్ ఎంపీగా గెలిచిన అప్పటినుంచి మోరంపూడి ఫ్లై ఓవర్ ని నిర్మిస్తాం అని చెప్పడం తప్ప చేతల్లో చూపించలేకపోతున్నారు. తన సొంత ఆస్తులను అమ్మైనా ఫ్లై ఓవర్ నిర్మిస్తాను అనడం చాలా విచిత్రంగా ఉంది. అంటే భరత్ రామ్ ఈ మూడు సంవత్సరాలలో ఎంత అవినీతికి పాల్పడ్డాడని ఇదొక నిదర్శనం. ఎలక్షన్ టైంలో అఫిడవిట్ దాఖలులో భరత్ రామ్ ఆస్తి విలువ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇటువంటి మోసపూరితమైన మాటలను ఇష్టానుసారంగా వాగడమే కాక జనసేన పార్టీని విమర్శించే స్థాయి ఎంపి భరత్ ది కాదని ఇప్పటికే అనేక పార్టీలు మారిన భరత్ ఒక నిలకడ లేని వ్యక్తిని ప్రజలు గమనించాలని అనుశ్రీ అన్నారు. రాజమండ్రి నగరం ఎవరి అడ్డా కాదని ఇది ప్రజలు అడ్డా తప్ప ఏ రాజకీయ పార్టీ అడ్డా కాదు. ప్రజలు వైసీపీ గవర్నమెంట్ ను వ్యతిరేకిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని 2024 లో ప్రజలు పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని ఆశిస్తున్నారని రాజమండ్రి నగరంలో జనసేన జెండాను ఎగరవేస్తామని అనుశ్రీ తెలిపారు.