కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ అధికారి ప్రతినిధిగా కళావతి నియామకం

ఆంధ్రప్రదేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ అధికారి ప్రతినిధిగా విశాఖ, గాజువాక ప్రాంతానికి చెందిన జనసేన నాయకురాలు, న్యాయవాది కరణం నూక రత్నం కళావతిని ఎంపిక చేయడం జరిగింది. ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్నీ జిల్లాల న్యాయవాదులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు హాజరై నూతన కార్యవర్గం ఎన్నుకోవటం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్ర దేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ చేతులమీదుగా అధికారిక పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ, మిగిలిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదములు తెలుపుతూ.. నామీద నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని బాధ్యతగా భావించి, అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తూ, సేవలు అందించి, అసోసియేషన్ కు అన్ని విధాలా సహకారం అందిస్తానని, ఆంధ్రప్రదేశ్లో కాపు న్యాయవాదుల హక్కులుకోసం పని చేస్తానన్నారు. న్యాయ పరంగా రాష్ట్రములో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నా వంతు కృషి చేస్తాను అన్నారు.