చెముడులంక జనసైనికులకు బండారు అభినందనలు

  • జనసేనాని ఆశయాలకు తోడుగా మేమున్నామని, కదం తొక్కి, జెండా స్థూపం ఆవిష్కరించిన చెముడులంక గ్రామ జనసైనికులు
  • చెముడు లంక గ్రామ ప్రముఖ నాయకులు ఎక్స్ ఎంపిటిసి సభ్యులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు (బాస్) మరియు ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు తమ్మన భాస్కరరావు నాయకత్వంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం లోని, చెముడులంక గ్రామంలో బుధవారం రాత్రి భారీ చేరికలతో, జెండా స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో వారి నాయకత్వానికి మెచ్చి, చెముడులంక ప్రముఖ నాయకులు ఎక్స్ ఎంపిటిసి సభ్యులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు (బాస్) ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు తమ్మన భాస్కరరావు ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, మధ్య జనసేన జెండా స్తూపం ఆవిష్కరణతో పాటు భారీ చేరికలు జరగడం ఎంతో గొప్ప విషయమని, అధికారం ఉన్నవారిని కూడా లెక్క చేయకుండా, ఆలమూరు మండలంలో పలు గ్రామాల నుంచి, కొత్తపేట నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి జనసేన పార్టీలోకి ప్రజలు జనసేనాని ఆశయాలు నచ్చి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ఇదే మార్పుకు నాంది కాబోతున్నది ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తల మధ్య స్వాగతం పలుకుతూ, జనసేన కండువాను వారి భుజస్కందాలపై వేసి, అభినందించి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెముడులంక గ్రామ జనసైనికులు కార్యకర్తలతో పాటు, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, జిల్లా కార్యదర్శులు సంగీత సుభాష్ పినపల్ల ప్రస్తుత సర్పంచ్, మరియు జిల్లా జనసేన కార్యదర్శులు దొంగ సుబ్బారావు బొక్కా ఆదినారాయణ, మరియు పలు మండల జనసేన అధ్యక్షులు, గ్రామ నాయకులు మండల నాయకులు, జాంపోలు నాగేశ్వరరావు చొప్పెల్ల ఎంపిటిసి సభ్యులు, ప్రముఖన యువ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ (జెపి) మూలస్థానం గ్రామ నాయకులు, మడికి గ్రామ నాయకులు కొత్తపల్లి నగేష్, మల్లవానితోట శెట్టిబలిజ యువ నాయకులు నాయకులు పంపన సురేష్, ఆలమూరు మండల జనసేన నాయకులు మీడియా ప్రసార కార్యదర్శి బైరిశెట్టి రాంబాబు, పలువురు ప్రముఖులు, జనసేన శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.