జనసేనాని సంఘీభావ దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చిన బండారు శ్రీనివాస్

ఉక్కుమనిషి జనసేనాని దృఢసంకల్పం! విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడడమే లక్ష్యం! విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదానికి అండగా రండి! మంగళగిరికి తరలి రండి! బండారు శ్రీనివాస్ జనసేన ఇంచార్జ్!

జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరి, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు జనసేనాని హాజరు, రండి, వేలాదిగా తరలి రండి! న్యాయం కోసం నిలబడి వారికి మద్దతిద్దాం.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, నాలుగు మండలాల్లోని, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా విజయవాడ, మంగళగిరి, జనసేన పార్టీ కార్యాలయం నందు, పక్కన ఉన్న ప్రాంగణంలో విశాఖ ఉక్కు దీక్ష కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షకు అందరు మద్దతు ప్రకటించాలని, ఉక్కుమనిషి జనసేనాని సంకల్పానికి మద్దతుగా ప్రతి ఒక్కరు నిలిచి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవాలని, గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఘన నివాళి అర్పించి, జనసేనానికి మద్దతుగా నిలబడమని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థించుచున్నాను. మన లక్ష్యం నిజాయితీ గల నాయకుడు వెంట నడవడం! రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం! భావితరాల యువతకు బంగారు బాట వేయడమే మన లక్ష్యం! అదే జనసేనాని సంకల్పబలం! రండి! తరలి రండి, వేలాదిగా కదిలిరండని పిలుపునిచ్చారు.