కిడ్నీ బాధితురాలికి ‘బత్తుల’ ఆర్థిక సహాయం

రాజానగరం, రాజానగరం మండలం, కొత్త వెలుగుబంధ గ్రామానికి చెందిన కూటి భద్రమ్మ కిడ్నీ సమస్యతో రాజమండ్రి హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకున్న జనసేన “నా సేవ కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి… మెరుగైన వైద్యం చేయాలని డాక్టర్లు సూచించి, వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/-₹ రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట అనిల్ వాసు, అడ్డాల దొరబాబు, అడ్డాల దుర్గాప్రసాద్, నాతిపాం తేజ బాబు పాల్గొన్నారు.