జనసేనలో చేరిన బీసీ నేత శ్రీనివాసులు

జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసులుకి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కర్నూలు జిల్లా నాయకులు శ్రీమతి రేఖా గౌడ్, అర్షద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.