జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ

జనసేన ఆవిర్భావ దినోత్సవం 8వ వార్షికోత్సవం సందర్బంగా 52 వార్డ్ ఎన్ఏడి, కరాస కూడలిలో స్వరూప్ దుండ్డంగి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఉత్సాహంగా పాల్గొని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేరేంత వరకూ మేము కృషి చేస్తాం అని తెలపడం జరిగింది. సోమవారం జరగబోయే ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్ అవుతుంది. మునుపెన్నడూ.. ఏ రాజకీయ పార్టీ చేయని విదంగా ఈ సభ జరుగుతుంది. ఈ ఆవిర్భావ దినోత్సవంను మా జనసైనికులు అందరం ఒక పండుగలా చేసుకుంటాం అని తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *