కార్యకర్తలను ఏకతాటికి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి

ఉమ్మడి ఖమ్మం జిల్లా: చండ్రుగొండ మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కుక్కముడి నరసింహారావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరికే రాంబాబు పాల్గొని చండ్రుగొండ మండలంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని, నిరంతరం ప్రజలలో జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు నాయకులు కలిసి కట్టుగా పనిచేయాలని అలాగే మండలంలో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి గ్రామ కమిటీలు వెయ్యాలని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ అధ్యక్షుడు డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో మండల యువజన విభాగ కమిటీని కూడా నియమించడం జరుగుతుందని తెలియజేసినారు. చండ్రుగొండ మండలంలో ఉన్న పది పంచాయతీల్లో అంతర్గత సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఏకతాటికి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల అధ్యక్షుడు నరసింహారావు కు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చండ్రుగొండ మండల ప్రధాన కార్యదర్శి సాయి భాస్కర్, కార్యదర్శి చాపల మడుగు వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సిహెచ్ పవన్, సిహెచ్ అజయ్, డేరంగుల సాయి సర్వీస్, కందూరి పవన్, సిహెచ్ వెంకటేష్, మండల ముఖ్య నాయకులు వీరభద్రరావు, గేయ రచయిత బాల ప్రసాద్, మైనార్టీ నాయకులు బాద్ షా, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.