జనసేన క్రియాశీలక సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో శ్రీశ్రీశ్రీ అష్టపద్మాల అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా మంగళవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కమిటీ వాలంటీర్ శ్రీ నాగమల్లి దానామూర్తి మరియు క్రియాశీలక సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. సుమారు రెండువేలమంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేయిడము జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.