తొలగించిన పింఛన్లను వెంటనే అమలు చేయాలి: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, నరకూరులో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు బుధవారం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, తొలగించిన పింఛన్లను వెంటనే అమలు చేయాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పింఛన్లు అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ పిట్టల దొర కబుర్లు చెప్పిన బటన్ రెడ్డి గారు.. లక్షలాది మంది పింఛన్లు ఎత్తేయడాన్ని సమర్ధించుకుంటున్నారా. అయ్యా.. పింఛన్ల మీద ఆధారపడి జీవించే నిరుపేదకు వేల ఎకరాల భూములు ఎలా వస్తాయి?. భూములు ఉన్నాయని ఆన్ లైన్ లో తప్పుగా చూపినంత మాత్రాన విచారణ లేకుండా పింఛన్లు నిలిపేస్తారా?, వృద్ధాప్యంలో భరోసా లేకుండా చేస్తారా?, మీరు నెత్తి మీద చేతులు పెట్టి నిమిరిన అవ్వా, అక్క, తాతలకు మీరు చేస్తున్నది అన్యాయం కాదా?, పింఛన్లు ఆపేయాలంటే మూడేళ్ల క్రితం చనిపోయిన వారు కూడా బతికి వచ్చి మీకు టాక్సులు కడతారు?, సొంత ఇల్లు ఉంటే పింఛన్లు కట్ చేస్తున్నారు, అద్దె కొంపలో ఉండడానికి మీరిచ్చే పింఛన్ల డబ్బు సరిపోతుందా?, సొంత ఇల్లు ఉంటే ఆకలి తీరిపోతుందా?, వృద్ధులకు వేసుకోనే మందులు వచ్చేస్తాయా?, వయసు మళ్లిన అవ్వా, తాతలపై జగన్ రెడ్డి గారికి ఎందుకంత కోపం, గత ఎన్నికల్లో వారంతా మీకే ఓట్లు వేశారు కదా? అయినా కనికరం చూపరా?, కొత్త ఏడాది వేళ మా పింఛన్ లో రూ. 250 కలుస్తుందన్న ఆశతో ఉన్న వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ.. అసలుకే లేకుండా ఎత్తేస్తారా?. ఫించన్ ఎత్తేసేందుకు మీరు చూపే కారణాలు సహేతుకంగా లేవు. వృద్ధుల ఉసురు మూట కట్టుకోవద్దు జగన్ రెడ్డి బటన్ నొక్కి అద్భుత పాలన చేస్తున్నాననుకుంటున్న మీరు, ఆ డబ్బు ఎవరి ఖాతాలకు చేరుతుందో తెలుసుకోకపోతే ఎలా?. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అర్ధం అయ్యిందనుకుంటా?, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 60 వేల మంది ఫించన్ కట్ చేసేందుకు సిద్ధమై, నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే అర్హత ఉన్న లక్షలాది మంది ఫించన్లు తీసేశారు. గడప గడపన మీ ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర లబ్దిదారులు మొరపెట్టుకున్నా కనికరం చూపడం లేదు. స్పందనలో ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. బటన్ రెడ్డి గారికి స్పందించే మనసు లేదని ప్రజలందరికీ అర్ధం అయిపోయింది. వృద్ధుల ఉసురు మూటకట్టుకున్న మీకు తగిన శాస్తి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ ఇచ్చేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో తేలిమేటి చిన్న, ఠాగూర్, వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.