రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం మండలం దర్శినమల గ్రామానికి చెందిన బోయ నరేంద్ర 30, బోయ రామంజి 32 రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేలు రూపాయిలు ఆర్థిక సాయం చేసి భవిష్యత్తులో మీ కుటుంబాలకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.