ఆసరా పెన్షన్ దారుల గుబులు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
వికలాంగుల సంఘం జిల్లా నాయకులు రాజు, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లు మంజూరు చేసి కేవలం కొందరికి మాత్రమే తుతు మంత్రంగా కార్డులు పంపిణీ చేశారు. కాని వికలాంగులు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వేలల్లో దరఖాస్తులు చేశారు. ఇవన్నీ పెండింగులో ఉన్నాయి. అసలు పెన్షన్లు వస్తయో రావో అని గుబులు చెందుతున్న పెన్షన్ దారులు కాబట్టి ప్రభుత్వం వెంటనే దరఖాస్తు చేసుకున్న వాటిని విడుదల చేసి, మళ్ళీ కొత్త వాటికోసం నోటిికేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పెన్షన్లు పెట్టాలని కోరుతున్నాం. లేని యెడల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో భోజ రెడ్డి, పరమెష్ తదితరులు పాల్గొన్నారు.