కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో విధులు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కి నా తరఫున, జనసేన పక్షాన అభినందనలు అంటూ ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సెక్యూరిటీ విభాగంలో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, ఇంటెలిజెన్స్ లాంటి విభాగాల్లో అనుభవం ఉన్న ఆయన శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. రాజకీయ కక్ష సాధింపు కేసుల కంటే ప్రజల ధనమాన ప్రాణాల సంరక్షణ.. ముఖ్యంగా బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడం పోలీసు శాఖ ప్రాధాన్యంగా మారుస్తారని ఆశిస్తున్నానని జనసేనాని అన్నారు.