ఆవిర్భావ సభ సక్సెస్ కు సహకరించాలి

అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు, చిరంజీవి యువత సభ్యులు ఆదివారం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడంలో భాగం కావాలని మనోహర్ తెలిపారు. అఖిలభారత చిరంజీవి యువత నాయకులు ఎస్. కృష్ణప్రసాద్, ఎల్.శ్యామ్ ప్రసాద్, సుగుణబాబు, రాకేష్, మేకల రవీంద్ర తదితరులు ఈ బృందంలో ఉన్నారు.