రణస్థలంలో కరెంట్ కష్టాలు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెరల్, రణస్థలం మండలంలో హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7:30 వరకు విద్యుత్ ఇవ్వలేదు. అంటే ఈ వైస్సార్ ప్రభుత్వం అసమర్ధ పాలన, విద్యుత్ డిపార్ట్మెంట్, మంత్రి ఏమి చేస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఏమయ్యారు నిద్రపోతున్నారా..? మీరు పాలకులా, మీకు ప్రజలు కష్టాలు కనిపించవు, మీకు ఎలక్షన్ అప్పుడు ఓట్లు కావాలి అంతే, జగన్మోహన్ రెడ్డి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఏమైంది, మీ మాటలు ఓట్లు కోసమేనా, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటమి కాయం, టీడీపీ హయాంలో బాదుదే…బాదుడు అన్నారు, మీరు చేస్తున్నది. డబల్ దంచుడే…దంచుడు (వైఎస్సార్సిపి) జనసేన పార్టీ నుండి మేము దీనిని తీవ్రంగా కండిస్తున్నామని, ఈ విద్యత్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామని కృష్ణాపురం నాయకులు నడుపూరు శంకర్రావు అన్నారు.