దామోదరం సంజీవయ్య జీవితం స్ఫూర్తి దాయకం

గుంటూరు, భారతీయ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 50 వ వర్ధంతి సందర్భంగా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జనసేన శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజాసేవకు, విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దామోదరం సంజీవయ్య ఆశయాలను జనసేన పార్టీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య తీసుకున్న సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వృధ్యాప్య, విడో పెన్షన్లు ఆయన ప్రవేశ పెట్టినవే అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు సంజీవయ్య రాజకీయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని గాదె వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాదక్ష్యుడు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, కొప్పుల కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, కొనిదేటి కిషోర్, అరుణ, హైమావతి, శేషు, కొత్తకోట ప్రసాద్, నెల్లూరి రాజేష్, మధులాల్, శిఖా బాలు, శ్రీభూషయ్య, సతీష్, వందనం, శ్రీనివాస్, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.