“జీవో 217” కారణంగా మత్స్యకారులు పడుతున్న బాధలు వివరించిన ధవళేశ్వరం జనసేన నాయకులు

ధవళేశ్వరం, మత్స్య వికాస విభాగం సంకల్పంతో “మత్స్యకార అభ్యున్నతి యాత్ర” పర్యటనలో భాగంగా ధవళేశ్వరం “సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్” దగ్గరకు మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన “జీవో 217” కారణంగా మత్స్యకారులు పడుతున్న బాధలు, సమస్యల గురించి వివరిస్తున్న ధవళేశ్వరం జనసేన పార్టీ నాయకులు “ధారపు శివ రెడ్డి”, మత్స్యకారుల ప్రెసిడెంట్ “అచ్యుత్”, సెక్రెటరీ అన్నవరం. వాళ్ళతో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మత్స్యకాలకు అండగా ఉంటారని మనోహర్ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వీరమహిళలు మరియు జనసైనికులు.