తదేకం ఫౌండేషన్ సౌజన్యంతో శెట్టి బత్తుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు సైకిళ్ళ పంపిణీ

అమలాపురం: కాకినాడ తదేకం ఫౌండేషన్ సౌజన్యంతో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆద్వర్యంలో అమలాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు 16 మంది దివ్యాంగులను గుర్తించి వారికి మూడు చక్రాల సైకిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాజబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల స్పూర్తితో తదేకం ఫౌండేషన్ వారు ఆర్ధిక సహాయం చేసి ఈ మూడు చక్రాల సైకిల్లను ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసారు. అదేవిధంగా నిజాయితీగా ఎవరికైతే సైకిల్లు అవసరమో వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపికచేసి వారికి సైకిల్లు అందచేసే బాద్యతను నెరవేర్చిన నియోజకవర్గంలోని జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తదేకం ఫౌండేషన్ వారు మలివిడతలో మరో 15 ట్రై సైకిల్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా అవసరం ఉన్న దివ్యాంగులకు పంపిణీ చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఇటువంటి కార్యక్రమాలలో భాగస్వామిని కావడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తిని కలుగజేసిందని, నేను పవన్ కళ్యాణ్ అనుచరుడునని చాలా గర్వంగా చెప్పుకుంటానని, అధికారం ఉన్నాలేకపోయినా జనసేన పార్టీ ఆపదలో ఉన్న ప్రజల అవసరాలు తీర్చడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సందాడి శ్రీనుబాబు,చిక్కాల సతీష్, చిక్కం భీముడు, సీనియర్ నాయకులు సూదా చిన్నా, ఆకుల బుజ్జి, కంకిపాటి వీరబాబు, మోకా బాలయోగి, కుంపట్ల రమేష్, చిక్కం సుధా సూర్యమోహన్, ముత్యాల మణమ్మ, గంగాభవాని, పొణకల ప్రకాష్, ముత్తాబత్తుల శ్రీను, లంకే వెంకట్రావు, సత్తి శ్రీను, తూము రమేష్, వంగా నాయుడు, గొలకోటి వెంకటేష్, ఆకేటి వెంకన్న, ఆకేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.