వెంకటాచలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నెల్లూరు జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకి వీర మహిళలకి ప్రమాద బీమా ధ్రువీకరణ పత్రంతో కూడిన సభ్యత్వ కిట్స్ అందజేసిన జనసేనపార్టీ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన క్రియాశీలక సభ్యత్వం కిట్లు 150 మందికి అందించడం జరిగింది వారు విలేకరులతో మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ ఇంతలా ఆలోచించి జెండా మోసే కార్యకర్తల కుటుంబాలకి రక్షణ కల్పించాలనే ఆలోచన లేని వ్యవస్థలో ఈరోజు జనసేన జెండాలు మోసే కార్యకర్తకి ఏమైనా ఆపద వస్తే దానికి జనసేన ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటాను అని క్రియాశీలక సభ్యత్వానికి నమోదు చేయించి ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వామిగా వారికి పార్టీ రక్షణ వలయంలాగా ఉండే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ జాయిన్ అయితే 50 వేల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే అవకాశం కల్పిస్తూ ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఒక శక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, బద్దిపూడి సుధీర్, స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, అంకెం సందీప్, సుధాకర్, రవికుమార్, కాకి శివకుమార్, మనుబోలు గణపతి, రహీం భాయ్, నాగరాజు, రంజిత్, సందీప్, వంశీ, శ్రీహరీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.