జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ..

నూజివీడు నియోజకవర్గ నాలుగు మండల, పట్టణ జనసేన క్రియాశీలక కార్యకర్తలకు సబ్యత్వ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో బాగంగా జిల్లా నియోజకవర్గ నాయకులతో కలిసి వాలంటీర్లను సన్మానించి.. వారికి కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేసిన పాశం నాగబాబు ను జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో, జిల్లా కార్యవర్గం, నియోజకవర్గ నాయకుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు మాట్లాడుతూ కార్యకర్తల శ్రేయస్సు కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి గొప్ప స్కీం ప్రవేశపెట్టడం.. అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసేన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ.. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు.