జనసేన వీరమహిళకు భరోసాగా జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్

దెందులూరు నియోజకవర్గం, విజయరాయి గ్రామంలో జనసేన వీరమహిళ చిన్నమ్మ చేపల వ్యాపారానికి దాదాపు రెండున్నర లక్షల నష్టం కలిగిస్తూ.. వైసీపీ చేస్తున్న దుందుడుకు చర్యలకు చరమగీతం పాడకపోతే ఇక మీదట సహించేది లేదు.. పార్టీ ఎల్లవేళల తమ కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని చిన్నమ్మ అన్ని సదుపాయాలతో వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు తాను చేస్తానని జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ హామీ ఇచ్చారు. ఇటువంటి పిరికిపంద చర్యలు సరికావని, ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తే జనసేన జెండా వదిలేస్తారు అనుకోవడం పిచ్చితనమని, మరోసారి ఇలాంటి పనులకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సాయి శరత్ హెచ్చరించారు.