మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఫ్లెక్సీ లను తొలగించాలి: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: పొదలకూరు పంచాయతీలోని గేట్ సెంటర్ వద్ద పేదలకి పెత్తందారులకిమధ్య జరిగే యుద్ధం అనే పేరుతో వైసిపి నాయకులు అత్యంత ఆటవికంగా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పల్లకి మోస్తున్నట్లు ఫ్లెక్సీలో చిత్రీకరించి వైసీపీ ఎమ్మెల్యేలు మరియు నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. దీనివలన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ పలు ప్రాంతాలు, కూడళ్ళలో “పేదలకు, పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం” అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుని అవతారంలో ఉండే విధంగా పెట్టి మా అధ్యక్షులు వారిని ఆ రాక్షసుడు తినేస్తాడు అనే అర్థం వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. మా అధ్యక్షుల వారిని ఆ రాక్షసుడే కాదు కదా, ఏ రాక్షసుడు కూడా ఏమి చేయలేడని తెలియజేస్తున్నాం. పైపెచ్చు ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే తుగ్లక్ పనులు సమాజంలోని పలు వర్గాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశంగా మారే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. మీరు కనుక అధికార పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణం తొలగించకపోతే అది ప్రభుత్వ వైఫల్యం గానో, లేదా ఇటువంటి తరహా ఫ్లెక్సీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని భావిస్తూ, సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం జగన్ గారి రాక్షస రూప ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అదే ప్రాంతంలో, అదే కూడళ్ళలో మా జనసైనికులు కూడా మా ఆలోచనధోరణి పరంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మనోజ్, సంజు రాకేష్, శ్రీహరి, ఖాజా, పవన్, కార్తీక్, శశి తదితరులు పాల్గొన్నారు.