8000 మందికి జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

జిన్నూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు పితాని వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ మడుగు మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా ఎండన పడి వచ్చే భక్తులకు దాహం తీర్చడానికి జన సైనికులు తమ వంతు సాయంగా డొక్కా సీతమ్మ చలివేంద్రం దాదాపు సుమారుగా ఎనిమిది వేల మందికి ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్, డిస్టిక్ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ అల్లు రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ బోనం చిన్న బాబు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.