పిఠాపురం ప్రజా సమస్యలపై పోరాట యాత్ర డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం పట్నం 12 వ వార్డు, 24 వ వార్డు, 29 వ వార్డు లో పలు ప్రజా సమస్యల నిమిత్తం పర్యటన పుణ్యమంతుల సోమరాజు అను ఒంటరి మహిళలకు ఏ ఆధారం లేక పెన్షన్ రాక అవస్థలు పడుతున్నటువంటి ఆమెను జన సైనికుల సహకారంతో పరామర్శించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అనంతరం వారి కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా వేల్పుల చక్రధర్, రెడ్డిపల్లి బాబురావు, పల్నాటి మధు, పసుపులేటి గణేష్, తోటకూర వెంకటరావు, పిట్ట చిన్న, మరియు జన సైనికులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది.