సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నా: గాదె

గుంటూరు: సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గుండారావు పేట నందు గల చర్చ్ నందు క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వివరించి.. క్రీస్తు చెప్పిన విలువైన వాక్యాలతో అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని, ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ.. జనసేన సిద్ధాంతంలో ఒకటైన మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తాం అని జనసేన పార్టీ తరపున సంసిద్ధంమయ్యేలా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాల రావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వర రావు, 23వార్డు నాయకులు దలవాయి కిషోర్, నగర సంయుక్త కార్యదర్శి నెల్లూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.