జనసైనికుని కుటుంబానికి ఆర్ధికసాయం

  • బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యాన్నిచ్చిన బొలియసెట్టి

తిరువూరు, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనమేరకు మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు మండలం ఎర్రమాడు గ్రామములో జనసేనపార్టీ కార్యకర్త మరియు ఎంపీటీసీ అభ్యర్థి కోటపాటి బోజా అకాల మరణం చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉపాధ్యక్షులు బొలియసెట్టి శ్రీకాంత్ స్పందించి జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణకి తెలియజేసి అధ్యక్షులు రామకృష్ణ సూచన మేరకు మంగళవారం జనసేనపార్టీ తరుపున ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ చేతుల మీదగా మరణించిన కోటపాటి బోజా తల్లికి 22000 వేలు ఆర్థిక సహాయం అందించి నివాళులు అర్పించడం జరిగింది. బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడు కోటపాటి బోజా జనసేనపార్టీలో కీలకమైన పాత్ర పోషించారు. అతని మరణం వార్త పార్టీకి తీరని లోటు కోటపాటి బోజా మరణవార్త పార్టీ నాయకులకు దిగ్భ్రాంతికి గురి చేసింది. బోజాకి భార్య, ఇద్దరు అబ్బాయిలు ఒక బాబుకి 8 సంవత్సరాలు రెండో అబ్బాయి 6 సంవత్సరాలు, కోటపాటి బోజా కుటుంబానికి జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మానుబోలు శ్రీనివాసరావు, తిరువూరు మండల అధ్యక్షులు పరసా పుల్లారావు, గంపాలగూడెం మండల అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణ, ఏ. కొండూరు మండల అధ్యక్షులు లాకవత్తు విజయ్, నియోజకవర్గ నాయకులు ఉయ్యురు జయప్రకాష్, పగడాల లక్ష్మణరావు, వట్టి కుంట కృష్ణ, గనిపిశెట్టి ప్రసాద్, పసుపులేటి రవీంద్ర, పసుపులేటి సతీష్, యేసయ్య చిలక వినోద్, ముదుగుండ్ల సాయి, తోట హరీష్, జరపాల రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.