గోడవర్రు గ్రామంలో “నా సేన కోసం – నా వంతు”

పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం, గోడవర్రు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కుండకర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు హాజరై జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి జనసైనికుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. గ్రామములోని ప్రతి జనసైనికుడు అత్యంత ఉత్సాహంగా ఇంటింటికీ తిరిగి తమ వంతు కర్తవ్యాన్ని పార్టీ కోసం కృషి చేసి ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగాస్వాములుగా చేయాలని మార్కండేయ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య యాదవ్, చేబ్రోలు మండల అధ్యక్షులు చందు శ్రీరాములు, చేబ్రోలు మండలం ఉపాధ్యక్షుడు చెన్నంశెట్టి శ్రీనివాసరావు, చేబ్రోలు నాయకులు నారిశెట్టి కృష్ణ, దోడ్డా వినయ్, కారుమంచి కోటేశ్వరరావు, గోడవర్రు జనసైనికులు బడే రామారావు, తోటకూర అంకమ్మ రావు, చల్లా వెంకట్రావు, విష్ణుమొలకల దశరధరామయ్య, బోద్దుల బాలాజి, మొక్కే వెంకటేశ్వరరావు, చల్లా పూర్ణ, వినుకొండ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.