తిరుపతిలో ‘నా సేన కోసం.. నా వంతు’

తిరుపతిలో, జనసేన అధినేత పిలుపుమేరకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ మరియు పలుచోట్ల జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, మనోజ్, వీరమహిళలు, జనసైనికులు మరియు ముఖ్య నాయకులతో కలిసి వారు ప్రజలను ఈ కార్యక్రమంలో మమేకం చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అశయ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేపట్టిన, చేస్తున్న ప్రజా కార్యక్రమాలను ప్రజలకు వివరించి, రేపు రాబోవు రోజుల్లో జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని, మార్పు కోసం, అవినీతి రహిత రాజకీయాల కోసం, ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ముఖ్య నేతలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.