గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 17వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 17వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలకు, వివిధ గ్రామాలకు వెళ్ళు రహదారులు పరిశీలించారు వీరఘట్టం జనసైనికులు. రాజన్న రాజ్యంలో రహదారులు ఏవి?
రోడ్లు రిపేర్ చేయండి సీఎం సారు, మా ఊరికి దారేది ఎం.ఎల్.ఎ గారు, ఎంపీపీ గ్రామనికి వేల్లె రహదారి అధ్వాన్నంగా ఉంది, నియోజకవర్గ ఎం.ఎల్.ఎ మరియు ఎం.పి నిధుల ఏమి అవుతున్నాయి. అంటూ నినాదాలు చేసిన వీరఘట్టం జనసేన పార్టీ నాయకులు.

  • పాలకొండ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల మీద గుంతలు స్టేట్ హైవే కావచ్చు, జిల్లా కేంద్ర కి కలిపే దారులు కావచ్చు, గ్రామాలకు, గూడలకు వెల్లు రోడ్లు కావచ్చు, వీధి లో రోడ్లు కూడా గోతులు మయం.
  • ఎక్కడ చూసినా గోతులు గోతులు ఇది ఒక గోతుల ఆంధ్రప్రదేశ్ గా ఉంది.

వీరఘట్టం మండల కేంద్ర నుండి వివిధ గిరిజన గ్రామాలకు వెళ్ళు రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం సడక్ యోజన నిధులు ఎమయ్యాయి మత్స పుండరీకం ప్రశ్నించారు? జనసేన జాని మాట్లాడుతూ ప్రతి మీటరుకు మీటరు గోతులు ఉన్నాయి, ప్రజల బ్రతుకు భారమైపోతుంది. ఈ గుంతల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రజల ఆరోగ్య పరిస్థితి పాడవుతుంది, ప్రాణాలు పోతున్నా కానీ వైసీపీ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంటూ పాలన చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గ పరిధిలోని రహదారులకు గోతులు పూడ్చి రోడ్లను బాగుచేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ ఆ కలల నుంచి గాఢనిద్ర నుంచి మేల్కొని రాష్ట్రంలో వెంటనే రోడ్లు బాగు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని కర్నేన సాయి పవన్, జరజాపు రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మాలి వినోద్, సొండి సుమన్, సొండి అమల, దూసి ప్రణీత్, కంటు మురళి, దత్తి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.