టెక్కలి జనసేన కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పాలకొండ జనసేన

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండల జనసేన పార్టీ నాయుకులు టెక్కలి జనసేన కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. జనసేన జానీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంపై వైసీపీ పార్టీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, వారు తొత్తులు దాడికి పాల్పడిన విధానం చూస్తే ఆ పార్టీ నేతలు దౌర్జన్యాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. ఈ కాలంలో కూడా ఇలాంటి దాడులు ఎంత మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అలానే ప్రస్తుతం రాజకీయాలు గురించి యువత తెలుసుకోని ఏలాంటి అధికారం లేకుండా కౌలు రైతులుకి 30 కోట్ల రూపాయిలు పంచిన పవన్ కళ్యాణ్ లాంటి నాయుకులుకి ప్రజలు అందరూ జనసేన పార్టీకి అండగా ఉండాలి అని జనసేన జానీ చెప్పడం జరిగింది. మత్స పుండరీకం మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాజధానులు పేరిట రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో ఏమి సాదించారు. అసెంబ్లీలో మెజార్టీ ఉంది, ప్రభుత్వంలో ఉండి కూడా విశాఖ గర్జన, మంత్రులు యాత్రలు ఎందుకు? ధర్మాన ప్రసాద్ మంత్రి పదవికి రాజీనామా పేరుతో నాటకాలు ఆడుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతున్నందున అది చూసి వైస్సార్సీపీ ఓర్వలేకపోతుంది. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓటమి తధ్యం అందుకే చిత్ర విచిత్ర మైన నాటకాలు ప్రదర్శిస్తున్నారు. కర్నెన సాయిపవన్ మాట్లాడుతూ… వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురుంచి వ్యక్తిగత జీవితాలు గురిచి తరువాత మాట్లాడుదురు గానీ ముందు రోడ్లు వెయ్యిపించండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వైస్సార్సీపీ ప్రభుత్వం కి చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో సొండి సుమన్, దూసి ప్రణీత్, బొమ్మాళి వినోద్ పాల్గొన్నారు.