నేతాజీకి ఘన నివాళులర్పించిన గుడివాడ జనసేన

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక కాకర్ల వీధిలో నేతాజీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బానిసత్వపు చీకట్లో మగ్గుతున్న భారతీయులను సైనికులుగా మార్చి స్వాతంత్ర్య సమర యోధులుగా తీర్చిదిద్దిన సేనాధిపతి జననం తప్ప మరణం లేని అమరవీరులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ కాకర్ల వీధిలో నేతాజీ విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, జగదీష్, చరణ్, రామ్ సాయి, కార్తీక్, జనసేన వీరమహిళ కళ్యాణి మరియు జనసైనికులు పాల్గొన్నారు.