జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపు

నెల్లూరు: ముస్లిం సోదరులకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం.. జనసేన పార్టీలో ముస్లిం సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఉంది, వారి అభిమానాన్ని పార్టీకి మద్దతు మార్చి గాజు గ్లాస్ కి ఓటు వేయిద్దాం.. అంటూ స్థానిక 48వ డివిజన్ కార్యకర్తలు షాజహాన్, ప్రతాప్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపు ఏడవ రోజులో భాగంగా వారి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకొని స్థానిక ఇరుగు పొరుగు వారికి జనసేన డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. పలువురు ముస్లిం కుటుంబాలు ఈసారి జనసేనకు మద్దతు ఇస్తామంటూ సంతోషంగా పలకరించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ముస్లిం పేద కుటుంబాలకు ఇస్తున్న షాదీ తోఫా, పేద విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్లు జాప్యం చేసి వారిని లెక్క పెట్టడం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధి లేక వివిధ భాగాలకు చెందిన నిధులను మళ్లింపులో భాగంగానే ఇటువంటి అవస్థలకు గురికావాల్సి వస్తుంది. వైసీపీ నేతలు తమ సొంత నిధులను ఇస్తున్నట్లుగా ఓటు వేసి గెలిపించిన ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది.. రాష్ట్ర అభివృద్ధి జరిగి అన్ని వర్గాల వారు సమాన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి జనసేనను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, షాజహాన్, ప్రతాప్, కంతర్ణబాయ్, అమీన్, మౌనేష్, హేమచంద్ర, అలేఖ్ తదితరులు పాల్గొన్నారు.