సీఎం కోనసీమ పర్యటన నేపథ్యంలో కందుల దుర్గేశ్ హౌస్ అరెస్ట్

వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇస్తామని తెలిపిన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ ను సోమవారం రాత్రి  రాజమండ్రిలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కోనసీమ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. అనంతరం కందుల దుర్గేశ్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీకి చెందిన చాలా మందికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టలు చేశారని వివరించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని దుయ్యబట్టారు. ప్రభుత్వ పోకడ ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.