వైసీపీకి మరోసారి అధికారమిస్తే అనగారిన వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది

దళిత ద్రోహి జగన్ రెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్య పేరును మార్చి జగనన్న విదేశీ విద్య పేరు నామకరణం చేయడాన్ని 7వ డివిజన్ జనసేన నాయకులు దోమకొండ అశోక్ ఖండించారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 39 వల్ల పేద విద్యార్థులకు ఉపయోగం లేదని.. జగనన్న విదేశీ విద్య పథకం ప్రచారానికి తప్ప పేద విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదని..ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దళితులను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత దళితులను విస్మరించడం చాలా బాధాకరం. మళ్లీ వైసీపీ కి అధికారం ఇస్తే దళితులు అనగారిన వర్గాల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.