మీరు విద్యుత్ కోతలు విధిస్తే, ఉద్యమాలు మరియు ధర్నాలు చేస్తాం

పొన్నలూరు మండలం ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, పొన్నలూరు మండలంలో ప్రస్తుత వేసవి కాలంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గత పదిహేను రోజుల నుండి విద్యుత్ కోతలు ఎక్కువగా జరుగుతున్నాయి, రాత్రిపూట సమయంలో విద్యుత్ లేకపోవడం వలన చిన్న పిల్లలు మరియు వృద్ధులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరీ ముఖ్యంగా పల్లెటూళ్లలో విష సర్పాలు తిరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వేళల్లో విద్యుత్ కి ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు చూడాలి. ఈ విద్యుత్ సమస్య గురించి పై అధికారులతో కూడా మాట్లాడి త్వరగా సమస్యను పరిష్కరించాలని పొన్నలూరు మండలం “అసిస్టెంట్ ఇంజనీర్” (ఏఈ)కి జనసేన పార్టీ నుండి “రిప్రజెంటేషన్” ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో “కనపర్తి మనోజ్ కుమార్”, షేక్ ఖాజావలి, దోరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీను, షరీఫ్, గఫూర్, ఖాజావలి, లక్ష్మణ్, తిరుమల్ రెడ్డి, భార్గవ్ మొదలైన జనసేన నాయకులు పాల్గొన్నారు.