గొర్లపాడు గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

ఇచ్ఛాపురం నియోజక వర్గం కవిటి మండలంలోని గొర్లపాడు గ్రామంలో ఆ గ్రామ జనసైనికుల సహకారంతో నిర్మించిన జెండా స్థూపంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వర్ రావు, జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా ఆధ్వర్యంలో జనసేన జెండా ఎగురవేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏదైతే ఈ నెల 10 వ తేదీ నుండి జరగబోయే కీయాశీలక సభ్యత్వం కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి రాజు, జాయింట్ సెక్రెటరీలు మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం విజయవంతం చేయాలని, ప్రతీ మండల స్థాయిలో గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ముందుకు తీసుకుని వెళ్తారని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచిలి జెడ్పీటీసీ అభ్యర్థి డొక్కరి ఈశ్వర్ రావు, శ్రీకాకుళం జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యులు క్రాంతి కుమార్, దివాకర్, నియోజక వర్గ ఐటీ కోఆర్డినేటర్ కాళ్ళ దాలయ్యా, మున్సిపాలిటీ 10 వ వార్డు ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, ఎంపీటీసీ అభ్యర్థులు తలగాన సుశీల, కుర్మారావు, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, దుంగు భాస్కర్, ప్రదీప్, శంకర్, వేణు, మన్మధ ,రాజశేఖర్, రామ్మూర్తి, డిల్లేష్, రామకృష్ణ, మిన్నారావు, హరి, ప్రదీప్, ప్రవీణ్, సురేష్, శ్యామ్, దుర్యోధన, మోహన్, గొర్లెపాడు జనసైనికులు తదతరులు పాల్గొన్నారు.