జనసేన అధినేత జన్మదిన వేడుకలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జనసేనాని జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ ని కట్ చేసి, పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లెల సంతోష్, లక్కిరెడ్డి హిమవంత్, కల్లెపు అజయ్, శ్రావణపెల్లి శ్రీకాంత్,కొమ్ముల మధుబాబు, మోరె బాబు, సాయిచంద్, రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.