ఇంటింటా జనసేన.. ప్రజల్లోకి దూసుకెళ్తున్న అనంతపురం జనసేన

అనంతపురం నియోజకవర్గం: ఇంటింటా జనసేన కార్యక్రమంతో.. ప్రజల్లోకి దూసుకెళ్తున్న అనంతపురం జనసేన నాయకులు, కార్యక్రమంలో భాగంగా గురువారం 36వ డివిజన్, రాంనగర్ ఎక్సటెన్షన్ ప్రాంతంలో క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, భవాని నగర్ మంజునాథ్, వెంకటాద్రి నాయక్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ, పురుషోత్తం నాయక్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.