జనం జనం ప్రభంజనం

ఇప్పటంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. జనసేన సంస్కారమైన నమస్కారాలతో మొదలైన జనసేనాని స్పీచ్.. వైసీపీ నాయకుల వికృత చేష్టల మీదుగా భవిష్యత్తు కార్యాచరను వివరిస్తూ వైసీపీ ప్రభుత్వంకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ముగిసింది.

లక్షల మంది హాజరయ్యిన ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మిగలడం ఖాయం. అందరి అనుమానాలకు జవాబు చెప్తూనే వైసీపీ ను పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన జనసైనికులతో ఇప్పటం గ్రామం కిక్కిరిసింది. సముద్రపు అలల తాకిడికి విలవిల్లాడిన గట్టు మాదిరిగా సభా ప్రాంగణం అంతా జనసేన నినాదాల తాకిడితో పులకరించింది. వీరమహిళలు, జనసైనికులు, నాయకుల కేకలతో ఇప్పటం గ్రామంలో జాతర వాతావరణం నెలకొంది.